అంజనీపుత్రకు బెస్ట్​ రియల్​ఎస్టేట్ ​అవార్డు

అంజనీపుత్రకు బెస్ట్​ రియల్​ఎస్టేట్ ​అవార్డు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రముఖ రియల్​ఎస్టేట్​సంస్థ అంజనీపుత్ర ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్​కు 'బెస్ట్​రియల్​ఎస్టేట్​మార్కెటింగ్​కంపెనీ' అవార్డు లభించింది. స్విఫ్ట్​అండ్​లిఫ్ట్​మీడియా అండ్​టెక్​ ఎల్ఎల్​పీ ప్రతి ఏటా వివిధ రంగాల్లో అసాధారణ సేవలందిస్తున్న సంస్థలకు తెలంగాణ బిజినెస్​ఎక్సలెన్స్​ అవార్డులు ప్రదానం చేస్తోంది.

2024 సంవత్సరానికి గానూ బెస్ట్​రియల్​ఎస్టేట్​మార్కె టింగ్​కంపెనీగా అంజనీపుత్ర ఎస్టేట్స్​ను ఎంపిక చేసింది. సోమవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో  సంస్థ ఫౌండర్​అండ్​సీఈవో నీలేశ్​సాబే, సినీ నటి భూమికా చావ్లా చేతుల మీదుగా అంజనీపుత్ర ఎస్టేట్స్​చైర్మన్​ గుర్రాల శ్రీధర్, ఎండీ పిల్లి రవి, డైరెక్టర్లు అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మార్కెటింగ్​ఏజెంట్లకు, కస్టమర్లకు గుర్రాల శ్రీధర్​కృతజ్ఞతలు తెలిపారు.