పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : కలెక్టర్ అంకిత్

పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి :  కలెక్టర్ అంకిత్
  • బోధన్  మున్సిపల్ ప్రత్యేకాధికారి అదనపు కలెక్టర్ అంకిత్ 

బోధన్,వెలుగు: మున్సిపల్​ అధికారులు సిబ్బంది తాగునీటి, పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మున్సిపల్​ ప్రత్యేకాధికారి, అదనపు కలెక్టర్​ అంకిత్​ సూచించారు.  మంగళవారం బోధన్​ మున్సిపల్​ ప్రత్యేకాధికారి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్​ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటిని ప్రతికాలనీకి వచ్చే విధంగా నీటి సరఫరా చేయాలన్నారు.

పట్టణం అభివృద్ధి చెందాలంటే వందశాతం పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  బోధన్​ పట్టణ శివారులోని మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.  పాఠశాలలోని రికార్డులను , వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పరిశీలించారు.  కూరగాయలు,  వంటసామగ్రి పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు.  మెనూ ప్రకారం  భోజనం, కూరలు అందించాలన్నారు.  అనంతరం పట్ణణ శివారులోని డంపింగ్​ యార్డును పరిశీలించారు.  కలెక్టర్ వెంట సబ్​ కలెక్టర్​ వికాస్​ మహతో, మున్సిపల్​ కమిషనర్​ వెంకటనారాయణ,  మున్సిపల్​ సిబ్బంది ఉన్నారు.