
- మార్క్ శంకర్ కోలుకోవడంతో మొక్కులు చెల్లించిన అన్నా కొణిదెల
హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ వరాహ స్వామి వారి దర్శనం చేసుకుని అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో భక్తులందరితో పాటు అన్నా కొణిదెల తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం సాయంత్రానికి తిరుమలకు చేరుకున్న ఆమె..ముందుగా గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొని, తిరుమల శ్రీవారిని పవన్ భార్య దర్శించుకుంటారు.
ఈ నెల 8న సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్, అన్నా కొణిదెల కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. స్కూల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో అస్వస్థతకు గురయ్యాడు. మార్క్ శంకర్ కోలుకోవడంతో పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల కొడుకును తీసుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు.