మరో 11 మృతదేహాలు వెలికితీత

మరో 11 మృతదేహాలు వెలికితీత
  •      నేపాల్​లోని త్రిశూలీ నదిలో బస్సులు పడ్డ ఘటనలో 12కు పెరిగిన మృతుల సంఖ్య

ఖాట్మండు: నేపాల్​లో కొండచరియలు విరిగిపడడంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరో 11 మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ సోమవారం వెలికితీశాయి. అందులో ముగ్గురు ఇండియన్లు, నలుగురు నేపాలీయులని అధికారులు తెలిపారు. వారి బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. మిగతా నాలుగు డెడ్​బాడీలు బస్సులో ఉన్నవారివా కాదా అనేది తెలియాల్సి ఉందన్నారు. 

ఈ డెడ్​బాడీలన్నీ కొండచరియలు విరిగిపడిన ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో లభించాయన్నారు. గత శుక్రవారం బీర్​గంజ్​ నుంచి ఖాట్మండుకు వెళ్తున్న ఏంజెల్ డీలక్స్ బస్సు, ఖాట్మండు నుంచి గౌర్​కు వెళ్తున్న మరో బస్సుపై సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న త్రిశూలి నదిలో రెండు బస్సులు కొట్టుకుపోయాయి.

 ఆ టైంలో ముగ్గురు మాత్రమే ప్రాణాలు కాపాడుకోగా మిగతా 50 మందికిపైగా గల్లంతయ్యారు. ఇప్పటివరకు భారత్ కు చెందిన ఒకరి మృతదేహం మాత్రమే అధికారులు ఆదివారం గుర్తించారు. సోనార్ ఇమేజింగ్ ఎక్విప్​మెంట్ల సాయంతో 500మందికిపైగా నేపాలీ సైనికులు గల్లంతైనవాళ్లకోసం వెతుకుతున్నారు.