హర్షసాయిపై మరో కేసు

హర్షసాయిపై మరో కేసు
  • ట్రోలింగ్ చేయిస్తున్నాడని సైబర్​క్రైమ్​ను ఆశ్రయించిన బాధితురాలు
  • నార్సింగి పీఎస్​లో ఇప్పటికే హర్ష పై మూడు కేసులు  

గచ్చిబౌలి, వెలుగు: యూట్యూబర్​హర్షసాయిపై మరో కేసు నమోదైంది. తనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్​ చేయిస్తున్నాడని గచ్చిబౌలిలోని సైబరాబాద్​సైబర్ క్రైమ్​పోలీసులకు బాధితురాలు మరో ఫిర్యాదు చేసింది. తనపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, స్ర్కీన్​షాట్లను అందజేసింది.

 దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే నార్సింగి పీఎస్​లో బాధితురాల ఫిర్యాదుతో హర్షసాయిపై లైంగిక ఆరోపణలు, చీటింగ్, బ్లాక్​మెయిల్​కేసులు నమోదైన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.