నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర మరోసారి అగ్నిప్రమాదం

నాగార్జున సాగర్ ఎర్త్ డ్యాం దగ్గర మరోసారి అగ్నిప్రమాదం

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం పరిధిలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 6న మద్యాహ్నం ఎర్త్ డ్యాం దగ్గర  మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో  ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. అప్పటికే మంటలకు  ఎర్త్ డ్యాం పై ఉన్న సీసీ కెమెరాలు, విద్యుత్ వైర్లు ధ్వంసం అయ్యాయి. డ్యాం దగ్గర ఇటీవల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి

ALSO READ | మెట్రోలో బెట్టింగ్ యాడ్స్​పై హైకోర్టులో పిల్

మార్చి 19న  నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ ప్రధాన ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వద్ద  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాయింట్‌‌‌‌‌‌‌‌ నుంచి శివుడి పార్క్‌‌‌‌‌‌‌‌ వరకు ఎర్త్‌‌‌‌‌‌‌‌ డ్యాం వెంట ఉన్న చెట్లు పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 15, 21 తేదీల్లో డీఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగి చెట్లు, మొక్కలు కాలి బూడిదయ్యాయి. తాజాగా మరోసారి ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.