
ముంబై: ఇటీవలి కాలంలో భార్యల వేధింపులు భరించలేక భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ముంబైలోనూ ఓ వ్యక్తి తన భార్య, అత్త వేధింపులతో సూసైడ్ చేసుకున్నాడు. గత శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముంబైలో యానిమేటర్గా పనిచేస్తున్న నిశాంత్ త్రిపాఠి(41) గత శుక్రవారం సహారా హోటల్లో ఓ రూమ్లో దిగాడు.
ఆ రోజే డోర్ బయట ‘డు నాట్ డిస్టర్బ్’ బోర్డు పెట్టాడు. మూడు రోజుల వరకూ గది నుంచి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది మాస్టర్ కీతో రూమ్ఓపెన్చేసి చూడగా.. బాత్రూంలో ఉరివేసుకొని కనిపించాడు. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిశాంత్ త్రిపాఠి తాను పనిచేస్తున్న కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ను అప్లోడ్ చేశాడు.
అందులో తన భార్యను ఉద్దేశిస్తూ.. "హాయ్ బేబ్.. నువ్వు దీన్ని చదివే సమయానికి నేను ఉండను. నా చివరి క్షణాల్లో ప్రతిదానికీ నేను నిన్ను ద్వేషించాను. కానీ, ఇక నుంచి అలా ఉండదు. ఈ క్షణం నుంచి నేను ప్రేమను ఎంచుకుంటాను" అని రాశాడు. అలాగే, "నా చావుకు నువ్వు, మీ అమ్మ కారణమని నా తల్లికి తెలుసు. కాబట్టి, మీరు ఆమెను సంప్రదించవద్దు. ఆమెను ప్రశాంతంగా దుఃఖించనివ్వండి" అని లెటర్లో పేర్కొన్నాడు. దీంతో నిశాంత్ను ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు అతని భార్య అపూర్వ పారిఖ్, అత్త ప్రార్థన మిశ్రాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బతికున్న శవంలా మారా.. నిశాంత్ తల్లి ఆవేదన
మహిళా హక్కుల కార్యకర్త అయిన నిశాంత్ తల్లి నీలం చతుర్వేది తన కొడుకు మరణం పట్ల దుఃఖంతో ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. "ఈరోజు నేను జీవశ్చవంలా మారాను. నా కొడుకుతో పాటే నా జీవితం ముగిసింది. ఈ విషాద సమయంలో నాకు, నా కూతురుకు ధైర్యాన్ని కల్పించండి" అని కోరారు.