
ఉప్పల్: పాస్టర్ ప్రవీణ్పగడాల అంత్యక్రియలకు వెళ్తూ మరో పాస్టర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మాల్ కు చెందిన పాస్టర్ జోసెఫ్(45) తన కుటుంబంతో కలిసి చౌదరి గూడలో పాస్టర్ గా పనిచేస్తున్నాడు.
గురువారం సికింద్రాబాద్లో ప్రవీణ్మృతదేహాన్ని చూడడానికి తన బైక్ పై బయలుదేరాడు. ఈ క్రమంలో ఉప్పల్ మోడ్రన్ బేకరీ వద్ద వెనుక నుంచి అతని నవత ట్రాన్స్పోర్టు వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఉప్పల్ ఎస్ఐ కోటేశ్వరరావు తెలిపారు.