
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ఎయిర్పోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన రెండో పోలీస్స్టేషన్ను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి శనివారం ప్రారంభించారు. శంషాబాద్ నుంచి రోజుకు లక్ష మంది జర్నీ చేస్తున్నారని, మరిన్ని సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించామని చెప్పారు.
ఎయిర్పోర్టు ఏరియాలో కమర్షియల్, ఎకనామిక్స్ యాక్టివిటీస్ పెరిగాయన్నారు. కొత్త స్టేషన్లో ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలతో పాటు 20 మంది పోలీస్ సిబ్బంది నిరంతరంగా తమ సేవలు అందిస్తారని చెప్పారు. కొత్త ఔట్ పోస్ట్ నిర్మాణానికి సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.