![మేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య.. కుంగిన గిడ్డర్లు](https://static.v6velugu.com/uploads/2024/07/another-problem-arose-in-medigadda-project_T63xBeNGQR.jpg)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో మరో సమస్య తలెత్తింది. ఏడో బ్లాక్లో పిల్లర్ల కింద ఉన్న గిడ్డర్లు కుంగింది. దీంతో L&T నిన్న అర్ధరాత్రి నివారణ చర్యలు చేపట్టింది. బ్యారేజీలో కుంగిన ఏడో బ్లాక్ కింద ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు చేపట్టిన ప్రక్రియలో గ్రౌటింగ్ దెబ్బతిన్నది. ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు రావడంతో సాంకేతిక సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. పిల్లర్ల కింద నీటి ఊటల ద్వారా కిందకు జారి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.