UP Wolf Attack : తోడేళ్లు మళ్లీ దాడి చేశాయి.. బాలికకు తీవ్రగాయాలు

UP Wolf Attack : తోడేళ్లు మళ్లీ దాడి చేశాయి.. బాలికకు తీవ్రగాయాలు

యూపీలో తోడేళ్లు మళ్లీ దాడి చేశాయి. బహ్రైచ్ జిల్లాలో మంగళ వారం(సెప్టెంబర్ 10) రాత్రి తోడేళ్ళ దాడిలో 11 ఏళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. గడిచిన రెండు నెలల్లో తోడేళ్ల దాడిలో 8మంది చనిపోగా..20 మందికి పైగా గాయపడ్డారు. 

బహ్రైచ్ తోడేళ్ల దాడిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్య సీరియస్ గా తీసుకున్నారు. తోడేళ్ల దాడులను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు..  ఇప్పటివరకు 5 తోడేళ్లను పట్టుకున్నారు.

Also Read:-‘ఇంగ్లిష్ చానెల్’ను ఈదిన భారత సంతతి బాలిక

మొత్తం ఆ బహ్రైచ్ ప్రాంతంలో ఆరు తోడేళ్లు ఉన్నట్లు గుర్తించారు. అయితే మంగళవారం  బాలికపై దాడి చేసింది ఆరో తేడేలు అయి వుంటుందని భావిస్తున్నారు.  తోడేలును పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.