- చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డు ప్రదానం
- హాజరైన అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ప్రముఖులు
హైదరాబాద్, వెలుగు: మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సోమవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. ఇప్పటివరకు తనకు ఎన్ని అవార్డులు వచ్చినా ఈ అవార్డు రావడం నిజమైన అచీవ్మెంట్గా భావిస్తున్నానని చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో చిరంజీవి.. అమితాబ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇంట గెలిచి రచ్చ గెలవడం అనే నానుడికి భిన్నంగా తాను రచ్చ గెలిచాక ఇంట గెలిచానని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు వెంకటేశ్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్, సుబ్బిరామిరెడ్డి తదితర సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2024కు గాను చిరంజీవికి ఈ అవార్డును అందజేయనున్నట్టు అక్కినేని శతజయంతి సందర్భంగా గత నెల 20న నాగార్జున ప్రకటించారు.
The moment that will be framed and cherished for ages 😍
— Annapurna Studios (@AnnapurnaStdios) October 28, 2024
Big B @SrBachchan Ji honours Megastar @KChiruTweets Garu with #ANRNationalAward in this special centenary birth year of #ANR Garu ❤️🔥
Watch #ANRNationalAward2024 ceremony live here!
▶️ https://t.co/rHb8VZAQD8#ANRLivesOn… pic.twitter.com/6lKqZcPt3H