
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన ‘శతమానం భవతి’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ వీళ్లద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమ హీరోయిన్గా నటించబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి.
ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ శనివారం హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ పేరును అనౌన్స్ చేశారు. శర్వా కెరీర్లో ఇది 38వ చిత్రం. 1960 బ్యాక్డ్రాప్లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేసిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో అనుపమ పాత్ర కీలకంగా ఉండబోతోందని మేకర్స్ తెలియజేశారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.