Kohli, Anushka: నువ్వు నావాడివి.. కోహ్లీపై అనుష్క ఎమోషనల్ పోస్ట్

Kohli, Anushka: నువ్వు నావాడివి.. కోహ్లీపై అనుష్క ఎమోషనల్ పోస్ట్

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలుచుకుంది టీమ్ ఇండియా. శనివారం ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. చివరి వరకు తీవ్ర ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.

భారత్ సాదించిన విజయంపై పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సతీమణి హీరోయిన్ అనుష్క శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జాతీయ జెండాను భుజంపై వేసుకొని వరల్డ్ కప్ ట్రోఫిని పట్టుకున్న కోహ్లీ ఫొటోను షేర్ చేస్తూ.. ఈ మనిషిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు నా వాడివి అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. అంటూ రాసుకొచ్చారు అనుష్క శర్మ. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.