
2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం(ఫిబ్రవరి 28) అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3.22 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. శాసన సభలోఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇది.
రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. వ్యవసాయానికి రూ.48వేల కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ కేటాయింపులు చూస్తుంటే, ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇచ్చిన సూపర్-6 సంక్షేమ పథకాలపై శ్రద్ధ పెట్టినట్లు స్పష్టంగా చెప్పవచ్చు.
బడ్జెట్.. కేటాయింపుల వివరాలు
- రూ.3,22,359 కోట్లతో వార్షిక బడ్జెట్
- రెవెన్యూ వ్యయం- రూ.2,51,162 కోట్లు
- రెవెన్యూ లోటు - రూ.33,185 కోట్లు
- ద్రవ్య లోటు- రూ.79,926 కోట్లు
- మూలధన వ్యయం అంచనా- రూ.40,635 కోట్లు
- వ్యవసాయానికి రూ.48వేల కోట్లు
- వైద్యారోగ్య శాఖకు రూ.19,265 కోట్లు
- ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
- జల వనరుల శాఖకు రూ.18,020 కోట్లు
- రవాణా శాఖకు రూ.8,785 కోట్లు
- పంచాయతీ రాజ్ శాఖకు రూ.18,847 కోట్లు
- పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.13,862 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖకు రూ.1,228 కోట్లు
- పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లు
- ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
- బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
- అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు
- మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు
- గృహ నిర్మాణ శాఖకు రూ.6,318 కోట్లు
- జలవనరుల శాఖకు రూ.18,019 కోట్లు
- పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు
- ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు
- ఆర్అండ్బీకి రూ.8,785 కోట్లు
- యువజన, పర్యటక, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు
- గృహ మంత్రిత్వ శాఖకు రూ.8,570 కోట్లు
- తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు
- మద్యం, మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం కోసం నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు
- జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు
- వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
- పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు
- తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు
- ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం రూ.27,518 కోట్లు
- ఆర్టీజీఎస్ కోసం రూ.101 కోట్లు
- దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు
- మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు
- స్వచ్ఛాంధ్ర కోసం రూ.820 కోట్లు
- డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు
- ఆదరణ పథకానికి రూ.1000 కోట్లు