అన్‌స్టాపబుల్ షోకి చీఫ్ గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.?

అన్‌స్టాపబుల్ షోకి చీఫ్ గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు  నాయుడు.?

తెలుగులో ప్రముఖ ఓటిటి అయిన ఆహాలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో అన్‌స్టాపబుల్ షో విజయవంతంగా 3 సీజన్లు పూర్తీ చేసుకుని 4వ సీజన్లోకి అడుగుపెట్టబోతోంది. అయితే ఈ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ అతిథులను కొంతమేర డిఫరెంట్ గా ప్రశ్నలు అడుగుతూ టాస్క్ ఇస్తూ తనదైన శైలిలో ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. దీంతో ఈ షో ప్రపంచంలోనే అత్యధికంగా ఆడియన్స్ ని అలరించిన షోలలో 18వ స్థానంలో నిలిచింది. అయితే ఇటీవలే షో నిర్వహకులు 4వ సీజన్ ని గ్రాండ్ గా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే అన్‌స్టాపబుల్ షో 4వ సీజన్లోమొదటి ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మొదటి ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ ఎపిసోడ్ లో నారా నారా చంద్రబాబు నాయుడుతోపాటూ డిప్యూటీ సీఎం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి. 

గతంలో చంద్రబాబు నాయుడు, తన తనయుడు ఎమ్మెల్యే నారా లోకేష్ తో కలసి అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే ఇది ఎన్నికల ముందు జరిగింది. ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ఒకే ఎపిసోడ్ లో పాల్గొంటే ఫ్యాన్స్ కి పండగేనని చెప్పవచ్చు.

ALSO READ : Instagram: ఇంస్టాగ్రామ్లో ప్రభాస్ బ్యూటీ హవా.. ఇండియ‌న్‌ హీరోయిన్లలో ఈమెదే అగ్ర స్థానం

ఇక అన్‌స్టాపబుల్ షో 4వ సీజన్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా పాల్గొనవుతున్నాడు. ఈ ఎపిసోడ్ లో సూర్యతోపాటూ కంగువా చిత్ర టీమ్ కూడా సందడి చేయనుంది. మొత్తానికి గతంతో పోలిస్తే ఈసారి అన్‌స్టాపబుల్ షో మరింత ఆసక్తిగా ఉండబోతుందని చెప్పవచ్చు.