
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెజాన్ సంస్థ గిఫ్ట్ కార్డుల పేరిట ప్రజల సొమ్ము దోచుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన తన సిబ్బంది సైతం ఈ దోపిడీకి గురయ్యారని అన్నారు. ఒక సంవత్సరం గడువుతో కస్టమర్లకు గిఫ్ట్ కార్డులు ఇచ్చిన అమెజాన్.. గడువు తీరాక కస్టమర్లు గిఫ్ట్ కార్డులు వాడుకునే వీలు లేకుండా డార్మాంట్ అకౌంట్స్ కి కన్వర్ట్ చేసిందని మండిపడ్డారు పవన్.
295 మిలియన్ మందికి పైగా ఈ కామర్స్ యూజర్లు ఉన్న ఇండియాలో సుమారు ఒక మిలియన్ కి పైగా యూజర్లు అమెజాన్ గిఫ్ట్ కార్డులు కొన్నారని అన్నారు పవన్. ఆర్బీఐ ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం.. పీపీఐలు కనీసం ఒక ఏడాది గడువుతో ఉండాలని.. గడువు తీరాక ఇనాక్టివ్ గా ఉన్న అకౌంట్లను కస్టమర్లకు ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతనే డీయాక్టివేట్ చేయాలని అన్నారు పవన్.
Of late, few complaints raised by amazon gift card users have been brought to my attention. It is indeed concerning to realise that the expired gift card balance of amazon users would be lost into dormant accounts. Even my office experienced this issue of lost balances from… pic.twitter.com/V8m3SIb0R9
— Pawan Kalyan (@PawanKalyan) January 25, 2025
అకౌంట్ డీయాక్టివేట్ చేసాక సదరు సొమ్మును కస్టమర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలన్న ఆర్బీఐ నిబంధనను గుర్తు చేసిన పవన్.. ఈ కామర్స్ సంస్థలు ఇలాంటి అంశాల్లో పారదర్శకత పాటించాలని అన్నారు. కస్టమర్లను అనవసర నష్టాల నుంచి రక్షించాలని ఈ కామర్స్ సంస్థలను ట్వీట్ ద్వారా కోరారు పవన్ కళ్యాణ్.