
అమరావతి: మహిళా ఖైదీలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ ప్రకటించింది. వివిధ కేసుల్లో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న మహిళా ఖైదీలను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని వివిధ జైళ్లలో మొత్తం 53 మంది మహిళా ఖైదీల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి మహిళా జైలు నుంచి 19 మంది, కడప నుంచి 27 మంది, నెల్లూరు నుంచి 5 మంది, విశాఖపట్నం నుంచి ఇద్దర్ని చొప్పున విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, వీరి విడుదలకు కొన్ని షరతులను విధించింది. విడుదల కాబోయే మహిళా ఖైదీలు రూ.50వేలు పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. శిక్షా కాలం పరిమితి ముగిసే వరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఆదేశించింది. అలానే బయటకు వెళ్లిన తరువాత ఎలాంటి నేరాలకు పాల్పడినా వెంటనే మళ్లీ అరెస్ట్ చేసి ముందస్తు విడుదలను రద్దు చేస్తామని హెచ్చరించింది.
for more News…