ఏపీలో ఒక్కరోజే 425 కేసులు

ఏపీలో ఒక్కరోజే 425 కేసులు
  • 5854కు చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 425 కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో గురువారానికి కేసుల సంఖ్య 5854కు చేరింది. 92 మంది చనిపోయారు. 2983 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, ప్రస్తుతం 2779 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారని అధికారులు చెప్పారు. 24 గంటల్లో 13,923 మందికి టెస్టులు చేశారు.