
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి సర్కార్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. https://cse.ap.gov.in, https://apdsc.apcfss.in అనే అదికారిక వెబ్సైట్ల ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది ప్రభుత్వం. ఈమేరకు ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించారు మంత్రి నారా లోకేష్. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనునుండగా... జూన్ 6 నుంచి జులై 6 వరకు సీబీటీ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది ప్రభుత్వం.
16 వేల347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి సమాచారం, సంబధిత జీవోలు, పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, హెల్ప్లైన్ సెంటర్ల వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పొందవచ్చు. https://cse.ap.gov.in , https://apdsc.apcfss.in వెబ్సైట్లలో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.
►ALSO READ | జేఈఈ మెయిన్స్లో మనోళ్ల హవా.. రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్టూడెంట్లకు 100 పర్సంటైల్
ఇలా అప్లై చేసుకోవాలి:
అభ్యర్థులంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలిపింది ప్రభుత్వం. అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఒక డెమో వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు మంత్రి నారా లోకేష్.
Another promise kept!
— Lokesh Nara (@naralokesh) April 20, 2025
The Mega DSC Notification for 16,347 teacher posts has been released.
Online Application submission is LIVE.
📥 Application Portals:
👉 https://t.co/xMSx9NycwQ
👉 https://t.co/acflj2kIh3
For a smooth application process, please refer to the video and… pic.twitter.com/DTCoGEE0fW