రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది : ఏపీ మంత్రి పయ్యావుల

రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుంది : ఏపీ మంత్రి పయ్యావుల

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రశంసలు కురిపించారు. హైదరాబద్ లోని ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందన్నారు.  ఎప్పటికైనా ముఖ్యమంత్రినే అవుతానని రేవంత్ గతంలో చాలా సార్లు తనతో చెప్పారన్నారు. కేసీఆర్ కు  లొంగలేదు కాబట్టే రేవంత్ రెడ్డిని ప్రజలు ప్రత్యామ్నాయంగా చూశారని చెప్పారు.  చాలామంది నాయకులు కేసీఆర్ తో కుమక్కైన వాళ్లేనన్నారు పయ్యావుల.  

పెద్దోళ్ళని కొడితే కిందివాళ్ళు సంతోషిస్తారు.. హైడ్రా విషయంలో కూడా అదే జరుగుతుందన్నారు మంత్రి పయ్యావుల.  మెదట చిన్న వాళ్ళను సంతృప్తి పర్చాలని చెప్పారు.  తెలంగాణ ఎప్పుడూ చైతన్యవంతమైన రాష్ట్రమేనన్నారు.  సాధారణంగా ఏదో ఒక యాక్టివిటీ తెలంగాణలో ఉంటుందన్నారు.  తెలంగాణలో రాజకీయ సైలెన్స్ సాధ్యం కాదన్నారు పయ్యావుల కేశ్.