తిరుపతి నుంచి తెలంగాణకు గుడ్ న్యూస్ : MLA, MPల లెటర్ ప్యాడ్స్ ఓకే!

తిరుపతి నుంచి తెలంగాణకు గుడ్ న్యూస్ : MLA, MPల లెటర్ ప్యాడ్స్ ఓకే!
  • ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్​​ వెల్లడి

యాదగిరిగుట్ట/ హైదరాబాద్, వెలుగు: టీటీడీ నూతన పాలకమండలి ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సు (లెటర్ ప్యాడ్స్) లేఖలను ఆమోదించి, దర్శనం కల్పిస్తామని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్​​  తెలిపారు. శనివారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత ఎక్కువగా భక్తులు సందర్శించే యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 

‘‘టీటీడీ కొత్త ట్రస్ట్ బోర్డ్ ఏర్పడడానికి 2 నెలల సమయం పడుతుంది. కొత్త పాలకమండలి ఏర్పడిన వెంటనే తెలంగాణ నుంచి వచ్చే సిఫార్సు లేఖలను ఆమోదించి తిరుమల దర్శనం సదుపాయాలు కల్పిస్తాం” అని వెల్లడించారు. 

వెంకట్‌రెడ్డిని కలిసిన ఏపీ మంత్రి సుభాష్​

ఆర్​అండ్​బీ మినిస్టర్​ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్​ కలిశారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో వారి భేటీ జరిగింది. ఈ సందర్భంగా సుభాష్​ ​మాట్లాడుతూ.. హైదరాబాద్– విజయవాడ హైవేను 6 లైన్లకు విస్తరించే విషయంలో మంత్రి వెంకట్‌ రెడ్డి చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు.