విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన షర్మిల.. ఏపీ ప్రభుత్వానికి డెడ్లైన్

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన షర్మిల.. ఏపీ ప్రభుత్వానికి డెడ్లైన్

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై  ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి బైఠాయించారు. స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె డెడ్లైన్ విధించారు. ఈ నెల 4న మధ్యాహ్నం ఒంటి గంట లోపు తొలగించిన 4200 మంది కాంట్రాక్టు కార్మికులను విధుల్లో తీసుకోవాలని ఆమె అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే  ప్లాంట్ ఆవరణలోనే తొలగించిన కార్మికులకు అండగా నిరాహార దీక్షకు దిగుతానని -ఏపీ ప్రభుత్వాన్ని షర్మిల హెచ్చరించారు. 

ALSO READ | తిరుమలలో పవన్.. చేతిలో ‘వారాహి డిక్లరేషన్’.. ఇంతకీ అందులో ఏముంది..?

4 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించడం అన్యాయం అని, - నాలుగు నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గమని ఆమె చెప్పారు. - విశాఖ స్టీల్ ఆంధ్రులకు తలమానికం అని, - కాంగ్రెస్ హయంలో ప్లాంట్ లాభాల్లో ఉండేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయే సరికి ప్లాంట్ను నీరు గార్చారని షర్మిల తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి షర్మిల ఇంకా ఏం చెప్పారంటే..
* అంచెలంచెలుగా ప్లాంట్ ను దెబ్బ తీశారు 
* ఇది చాలా దుర్మార్గం
* 32 మంది బలిదానాలతో ప్లాంట్ ఏర్పడింది
* ఎంతో మంది భూములు స్వచ్చందంగా ఇచ్చారు
* విశాఖ కు సొంత మైన్ లేదు
* ప్లాంట్ కి ఇచ్చే ముడిపదార్ధాల ధరలు పెంచారు
* పాలకులు సిక్ ఇండస్ట్రీగా మార్చారు
* అవిటి ప్రాజెక్టు, కుంటి ప్రాజెక్టుగా చిత్రీకరిస్తున్నారు
* నష్టాల సాకు చూపి అమ్మాలని చూస్తున్నారు
* ఆదుకొనే చిత్తశుద్ది ఎవరికి లేదు
* కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఈ ప్లాంట్ విస్తరణ చేశారు
* 3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 7 మిలియన్ టన్నులు పెంచారు
* 20 మిలియన్ టన్స్ కి పెంచేలా బ్లూ ప్రింట్ రెడీ చేశారు


* ఒకప్పుడు 7 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ని 1 మిలియన్ టన్స్ కి తగ్గించారు
* ఉత్పత్తి తగ్గడానికి ఈ పాలకులే కారణం
* గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కూడా పట్టించుకోలేదు
* జగన్ కి నష్టాల్లో ఉన్నట్లు తెలియదట
* బాబు హామీ ఇచ్చాడట.. కానీ అమలు కాలేదు
* విశాఖ భూముల మీద మోడీ కన్ను పడింది
* కార్మికులు గత 13 వందల రోజులుగా చేస్తున్న దీక్ష ప్రభుత్వాలకు కనిపించడం లేదు
* ఇద్దరు కార్మికులు కూడా చనిపోయారట
* కేంద్రంతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకి ఎందుకు సంబంధం ఉండదు ?
* భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా చంద్రబాబుకి ఉంది
* వైఎస్ఆర్ హయంలో విశాఖ ప్లాంట్ కోసం అనంతపురంలో ఒక మైన్ కూడా ప్లాన్ చేశారు
* వైఎస్ఆర్ మరణం తర్వాత సొంత మైన్ ఇచ్చే బాధ్యతను కేంద్రం మరిచింది
* వైఎస్ఆర్ మరణం తర్వాత ఎవరికి ప్లాంట్ కష్టాలు పట్టలేదు
* విశాఖ సెంటిమెంట్ తో కూడిన ప్లాంట్ అన్నారు
* సెంటిమెంట్ అయితే 4 వేల మందిని ఎలా తీసేశారు
* 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న వాళ్ళు సెంటిమెంట్ కాదా ?

 

* విశాఖ స్టీల్ కష్టాలు పట్టని కేంద్రంతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు
* బాబు,పవన్ సమాధానం చెప్పాలి
* ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి
* చంద్రబాబు, పవన్ తక్షణం ఇక్కడకు రండి
* కార్మికులకు భరోసా ఇవ్వండి
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం
* ఒకరి మీద ఒకరు నెపం మోపకండి
* రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలి
* విశాఖ ప్రైవేటీకరణ ఆపాలి
* విశాఖ ప్లాంట్కి నిధులు కేటాయించాలి
* సొంత మైన్ ఇవ్వాలి
* విధుల నుంచి తొలగించిన 4 వేల మందికి తక్షణం ఉద్యోగాల్లోకి తీసుకోండి
*14 వేల మంది కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి
* సెయిల్ లో విలీనం చేయాలి
* గ్యారెంటీ ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది
* మీకు 48 గంటల సమయం ఇస్తున్నాం
* ఈ నెల 4 తేదీన మధ్యాహ్నం 1 గంటలోపు కాంట్రాక్టు కార్మికులను తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం
* 4 వేల మందిని విధులో తీసుకోక పోతే నిరాహార దీక్ష చేస్తాం
* ఇదే ప్లాంట్ ఆవరణలో షర్మిలా రెడ్డి దీక్ష చేస్తుంది
* అవసరం అయితే రాహుల్ గాంధీ  కూడా తీసుకు వద్దాం