వంశీ ఫోన్ ఎక్కడ..? గంటల తరబడి మాజీ వైసీపీ నేత ఏపీ పోలీసుల సోదాలు

వంశీ ఫోన్ ఎక్కడ..? గంటల తరబడి మాజీ వైసీపీ నేత ఏపీ పోలీసుల సోదాలు

హైదరాబాద్: టీడీపీ కేంద్ర ఆఫీస్లో పని చేసిన సత్యవర్ధని కిడ్నాప్ కేసులో దర్యాప్తును పటమట పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించా రు. హైదరాబాద్ రాయదుర్గంలోని వంశీ ఇంట్లో పోలీసులు గంటలతరబడి తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి వంశీ మొబైల్ కోసం ఇంటిని జల్లెడ పడుతున్నా రు. నిన్నటి సోదాల్లో భాగంగా సీసీటీవీ ఫుటేజ్‎తో పాటు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నా రు. అంతేకాక పంశీ ఇంట్లో గతవారం రోజుల సీసీ టీవీ ఫుటేజ్ సేకరించారు. 

వంశీ ఫోన్ మై హోమ్ గుణాలో చివరిగా ఫైల్ టవర్ లోకేషన్ చూపించడంతో... లోకేషన్ ఆధారంగా ఇంటిని సర్చ్ చేస్తున్నారు. మొబైల్ కోసం సుమారం రెండు గంటల పాటు సోదాలు చేసిన సెల్ఫోన్ లభించకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపొ యారు. ఫోన్ ను స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించా అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందులో పరారీలో ఉన్న నిందితుల కోసం మరో టీమ్ గాలింప చేపడుతోంది.