
అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగి పోతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,835 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపింది వైద్యారోగ్యశాఖ. ఒక్కరోజు వ్యవధిలోనే కరోనాతో మరో 64 మంది చనిపోయారని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,92,760కు చేరగా.. ప్రస్తుతం 90,279 యాక్టివ్ కేసులున్నాయని వెల్లడించింది. ఇప్పటి వరకు 4,97,376 మంది కోలుకున్నారని.. ఏపీలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5105కు పెరిగిందని తెలిపింది ఏపీ వైద్యారోగ్యశాఖ.
ఇవాళ్టి కరోనా రిపోర్ట్