
ముంబయిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేట్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ సర్కిళ్లలో 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(సీబీవో) పోస్టుల భర్తీకి అప్లికేషనన్స్ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. హైదరాబాద్ సర్కిల్లో 176 ఖాళీలున్నాయి.
అర్హతలు: మొత్తం 1422 పోస్టుల్లో రెగ్యులర్ ఖాళీలు 1400, బ్యాక్లాగ్ పోస్టులు 22 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. 2022 సెప్టెంబర్ 30 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. జీతం రూ.36000- నుంచిరూ.63840 ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థులు ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. భోపాల్, భువనేశ్వర్, హైదరాబాద్, జైపుర్, కోల్కతా, మహారాష్ట్ర, నార్త్ ఈస్టెర్న్ సర్కిళ్లలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 7వరకు అప్లికేషన్ ఫీజు రూ.750(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది) చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ నవంబర్ లేదా డిసెంబర్లో ఉంటుంది. ఆన్లైన్ పరీక్ష డిసెంబర్ 4న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.sbi.co.in వెబ్సైట్ సంప్రదించాలి.