
రాష్ట్ర వ్యాప్తంగా PG వైద్య విద్య, MDS కోర్సుల్లో ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్ PG-2019లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. PG కి దరఖాస్తు చేసుకునే MBBS విద్యార్థులు మార్చి 31 వరకు తమ ఇంటర్న్షిప్ పూర్తి చేసి ఉండాలని ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 7నుంచి 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.