
సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్స్ కోరుతోంది. సౌత్ సెంట్రల్ రైల్వే లోని 35 ఎస్టాబ్లిష్మెంట్లలోని 11 ట్రేడ్ లలో 4,103 ఖాళీలున్నాయి. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారం గా సెలెక్ట్ చేస్తారు.
మొత్తం ఖాళీలు: 4103
అప్రెంటిస్ వివరాలు: ఏసీ మెకానిక్– 250, కార్పెంటర్–18, డీజిల్ మెకానిక్–531, ఎలక్ట్రీషియన్–1019, ఎలక్ట్రానిక్ మెకానిక్–92, ఫిట్టర్–1460, మెషినిస్ట్–71, ఎంఎంటీఎం–5, ఎంఎండబ్ల్యూ–24, పెయింటర్–80, వెల్డర్–553 పోస్టులు ఉన్నాయి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయసు: 04.10.2021 నాటికి 15–24 ఏండ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలెక్షన్ప్రాసెస్: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తులు: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
చివరి తేది: 3 నవంబర్
వెబ్సైట్: www.scr.indianrailways.gov.in