
ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అవయవదానం బిల్లును అసెంబ్లీలో పెట్టడం, ఆమోదం పొందడం హర్షణీయమని ఆలిండియా బాడీ అండ్ ఆర్గాన్ డోనర్స్అసోసియేషన్వ్యవస్థాపక అధ్యక్షురాలు గూడూరు సీతామహాలక్ష్మి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.శుక్రవారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అవయవ దాతల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, అంత్యక్రియల సమయంలో కలెక్టర్ లేదా ఆర్డీవో స్థాయి అధికారి వచ్చి పూలమాల వేసి, బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని కోరారు. సంఘం కో–-ఆర్డినేటర్ ఎస్ .శ్రీనివాస్, సభ్యులు కవిత, రామలక్ష్మి, రజని పాల్గొన్నారు.