రూ.6 కోట్ల 96 లక్ష పనులకు ఆమోదం

రూ.6 కోట్ల 96 లక్ష పనులకు ఆమోదం

మేడిపల్లి, వెలుగు: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని 28 డివిజన్లలో రూ.6కోట్ల 96లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయర్ తోటకూర అజయాయాదవ్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సాధారణ సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేశారు.

 చికెన్ షాపుల నుంచి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్​చేసేందుకు ఓ ఏజెన్సీని ఎంపిక చేయాలని కౌన్సిల్ తీర్మానించింది. ఇచ్చిన మాట ప్రకారం మేయర్ అజయ్​ యాదవ్ సభ్యుల ఆమోదంతో చిరువ్యాపారుల నుంచి తైబజారు రుసుం వసూళ్లను రద్దు చేశారు. బోనాల ఉత్సవాల్లో ఆలయాలకు 100 మీటర్ల లోపు ఎలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటును చేయొద్దని కీలక నిర్ణయం తీసుకున్నారు.