నిఖిల్ "అప్పుడోఇప్పుడోఎప్పుడో" సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.

నిఖిల్ "అప్పుడోఇప్పుడోఎప్పుడో" సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.

టాలీవుడ్ ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ప్రస్తుతం "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తుండగా, కన్నడ బ్యూటీఫుల్ హీరోయిన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అజయ్, దివ్యాంశ కౌశిక్, హర్ష చందు, జాన్ విజయ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.  ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తీ చేసుకుని రిలీజ్ కి సిద్దంగా ఉంది. 

ఇటీవలే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అఫిషియల్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ని చూసినట్లయితే ఇందులో హీరో నిఖిల్ కార్ రేసర్ గా కనిపించాడు. అయితే నిఖిల్ లండన్ వెళ్ళి తెల్ల పిల్లని పడేసి వరల్డ్ టూర్ వెళ్లాలని అనుకుంటాడు. కానీ అనుకోకుండా హీరోయిన్ రుక్మిణి వసంత్ తో ప్రేమలో పడటం,   అలాగే ఓ సమస్యలో ఇరుక్కోవడం వంటివి జరుగతాయి.

Also Read :- శ్రీనువైట్ల కమ్బ్యాక్ ఇచ్చాడా..? గోపీచంద్కు హిట్ దక్కిందా..?

కొన్ని యాక్షన్ సన్నివేశాల తర్వాత "ప్రపంచంలో 90% అబ్బాయిలు తాగడానికి కారణం అమ్మాయిలే" అంటూ కమెడియన్ హర్ష చందుతో చెప్పే డైలాగులు టీజర్ కి హైలెట్ గా నిలిచాయి. సస్పెన్స్ థ్రిల్లర్ లో బ్యాక్ డ్రాప్ లో కట్ చేసిన ఈ టీజర్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంపై ఆసక్తిని పెంచింది.

ఈ విషయం ఇలా ఉండగా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం నవంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.  గతంలో దర్శకుడు సుధీర్ వర్మ మరియు నిఖిల్ కాంబినేషన్ లో వచ్చిన స్వామి రారా, కేశవ చిత్రాలు ఫర్వాలేదనిపించాయి. దీంతో ఈ సినిమాపై కూడా అటోమేటిక్‌గా అంచనాలు క్రియేట్ అయ్యాయి.  మరి ఈసారి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంతో ఆడియన్స్ ఏ విధంగా అలరిస్తారో తెలియాలంటే నవంబర్ 8 వరకూ ఆగాల్సిందే.

  • Beta
Beta feature