
హైదరాబాద్ సిటీ, వెలుగు: వచ్చే నెల 4 నుంచి -6 వరకు రేతిబౌలిలోని కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ జరగనుంది. మూడు రోజులపాటు ఉదయం 11 గంటలకు మొదలై, రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. 25 ఆర్ట్ గ్యాలరీల ఏర్పాటుతోపాటు 50 మంది దిగ్గజ కళాకారులు, 200 మంది ప్రముఖ -యువ కళాకారులు పాల్గొననున్నారు. 100 స్టాల్స్లో 3,500 పెయింటింగ్స్, శిల్పాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. జోగెన్ చౌదరి, మను పరేఖ్ వంటి ప్రముఖుల కళాకృతులతోపాటు యువ ఆర్టిస్టుల ఎగ్జిబిట్స్ఉంటాయని ఆర్ట్ఫెస్టివల్డైరెక్టర్ రాజేంద్ర తెలిపారు. ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్, ‘ఎటర్నల్ కాన్వాస్’ నిర్వహిస్తామని, ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు.