- తాను తీసుకోవడమే కాకుండా ఇతరులకు అమ్మకం
- ఆర్కిటెక్ట్ అరెస్ట్
మాదాపూర్, వెలుగు: తనతో పాటు హాస్టల్లో ఉంటున్న మరికొంత మందికి ఎండీఎంఏ డ్రగ్స్అమ్ముతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్సీఐ కృష్ణమోహన్వివరాల ప్రకారం.. కడపకు చెందిన జి. తేజకృష్ణ(28) మాదాపూర్చంద్రనాయక్తండాలోని జేఎంజే కో–లివింగ్హాస్టల్లో ఉంటూ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాడు. బెంగుళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ డ్రగ్స్సప్లయర్గా ఉన్న సాండీ(27) అనే వ్యక్తి వద్ద ఎండీఏంఏ డ్రగ్స్కొనుగోలు చేసి తాను తీసుకునేవాడు.
దాంతో పాటు తనకు చెందిన వ్యక్తులకు, హాస్టల్లో ఉన్న వారికి సైతం ఎండీఎంఏ అమ్ముతున్నాడు. దీనిపై సమాచారం రావడంతో మాదాపూర్ఎస్ఓటీ పోలీసులు, మాదాపూర్పోలీసులు కలిసి గురువారం తనిఖీ చేశారు. తేజకృష్ణ వద్ద 11.14 గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్ఫోన్లు, వెయింగ్మిషన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. 2024 జనవరి నుంచి తేజకృష్ణ సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తేజకృష్ణ గతంలో ఎండీఎంఏ అమ్ముతూ శేరిలింగంపల్లి ఎక్సైజ్పోలీసులకు చిక్కాడు.
మెటల్చార్మినార్ వద్ద మరొకరు అరెస్ట్..
హైటెక్సిటీలోని మెటల్చార్మినార్ కేంద్రంగా కొకైన్అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్సీఐ కృష్ణమోహన్వివరాల ప్రకారం.. మాదాపూర్ఇజ్జత్నగర్లోని అలేఖ్య హోమ్స్లో నివాసం ఉంటున్న ప్రసన్నకుమార్రెడ్డి(28) తన తండ్రికి చెందిన బిజినెస్చూసుకుంటున్నాడు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడంతో బెంగుళూరులో నివాసం ఉండే నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ కెవిన్(40) వద్ద కొకైన్కొనుగోలు చేశాడు.
హైదరాబాద్కు వచ్చిన తర్వాత తనకు తెలిసిన వారికి కూడా కొకైన్ అమ్మేవాడు. గురువారం మెటల్చార్మినార్వద్ద ఇతరులకు కొకైన్ అమ్మేందుకు వచ్చిన ప్రసన్నకుమార్ను మాదాపూర్పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొత్తం రూ.15.30 లక్షల విలువైన 23 గ్రాముల కొకైన్, ఒక కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు డ్రగ్ సప్లయర్కెవిన్, ఇద్దరు డ్రగ్పెడ్లర్లు ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన విశ్వమిత్రా, మణికొండకు చెందిన సాయి దీపక్, బోయిన్పల్లికి చెందిన డ్రగ్స్ వినియోగదారుడు వరుణ్గౌడ్పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కాచిగూడలో మరో ఇద్దరు..
హైదరాబాద్ సిటీ: కాచిగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని శంషాబాద్ ఎక్సైజ్, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్, 8 గ్రాముల ఓజీ కుష్ను సీజ్ చేశారు. వీటి ధర రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా. నిందితులను అబ్దుల్లా బిన్ అజీజ్ బర్వాజ్, మహ్మద్ ఖలీంగా గుర్తించారు. ఈ కేసులో మరో వ్యక్తి రషీద్ అలీఖాన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.