ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. డిప్యూటీ చైర్మన్‎​కు AICC చీఫ్ క్షమాపణ

ఖర్గే వ్యాఖ్యలపై దద్దరిల్లిన రాజ్యసభ.. డిప్యూటీ చైర్మన్‎​కు AICC చీఫ్ క్షమాపణ

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మంగళవారం చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. నేషనల్​ ఎడ్యుకేషనల్​పాలసీ (ఎన్ఈపీ)పై చర్చ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్​డిప్యూటీ చైర్మన్​హరివంశ్‎ను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఆ వ్యాఖ్యలకు ఖర్గే కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో దిగివచ్చిన ఖర్గే.. తన కామెంట్స్‎​పై సభకు క్లారిటీ ఇచ్చారు. 

డిప్యూటీ చైర్మన్ హరివంశ్‎కు క్షమాపణలు చెప్పారు. కాగా, ప్రశ్నోత్తరాల సందర్భంగా తమను అనాగరికులు అంటూ అవమానించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డీఎంకే ఎంపీలు డిమాండ్​చేశారు. అదే సమయంలో ఖర్గే మాట్లాడుతూ.. తాను మాట్లాడేటప్పుడు సభలో ధర్మేంద్ర ప్రధాన్​లేరన్నారు. కేంద్రం  నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నదని మండిపడ్డారు. ఈ సందర్భంగా ‘బయటకు గెంటేస్తాం’ అనే అర్థం వచ్చేలా కామెంట్​ చేశారు.