
ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్ ఎంపీ గా రెండోసారి గెలిచిన ఎంపీ అరవింద్ ను ఆదివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఢిల్లీలో కలిశారు. బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి అత్యధిక నిధులు వచ్చేలా , నవోదయ స్కూల్స్, ఫుడ్ పార్క్ , పరిశ్రమల ఏర్పాటు వంటివి కేంద్రం నుంచి వచ్చెలా చూడాలని ఎంపీని కోరినట్లు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తెలిపారు.