
ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ పెద్ద బజార్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పెద్దమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం పెద్ద మనుషులు, మహిళలు బోనాలు ఎత్తుకుని పెద్ద బజార్ నుంచి దోభీఘాట్ మీదుగా పెద్దమ్మ తల్లి ఆలయం వరకు వెళ్లి ఆలయంలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సంఘం అధ్యక్షుడు బోండ్ల సంతోష్, జక్కం శేఖర్, సుంకరిమోహన్, జక్కం భూమన్న, జిన్నా, సుమన్, సుంకరి శంకర్ తదితరులు పాల్గొన్నారు-.