ఇందూర్​లో ఆర్మీ పారా గ్లైడింగ్ విన్యాసాలు

ఇందూర్​లో ఆర్మీ పారా గ్లైడింగ్ విన్యాసాలు

నిజామాబాద్, వెలుగు : జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ గవర్నమెంట్​డిగ్రీ కాలేజీ గ్రౌండ్​లో సోమవారం సాయంత్రం ఆర్మీ పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సికింద్రాబాద్​ ఆర్మీ కంటోన్మెంట్ పారా మోటార్​ ఎక్స్​పెడిషన్​ 2025 పేరుతో ఢిల్లీలో చేపట్టిన యాత్ర ఆగ్రా, కాన్పూర్​, ఝాన్సీ, సాగర్​, జబల్పూర్​, పుల్గాం మీదుగా ఇందూర్​ చేరుకుంది. 

లెఫ్టినెంట్​ కల్నల్​ అమృత్ నేతృత్వంలోని టీంకు అదనపు కలెక్టర్​ కిరణ్​కుమార్​ స్వాగతం పలికారు. కాలేజీలోని ఎన్​సీసీ క్యాడెట్లు, యూత్​కు అవగాహన, ఆసక్తి కలిగించేలా  పారా గ్లైడింగ్​ విన్యాసాలు ప్రదర్శించారు. డీఎస్​వో అరవింద్​రెడ్డి, సివిల్​ సప్లై డీఎం  శ్రీకాంత్​రెడ్డి తదితరులు ఉన్నారు.