హర్యానాలో బస్సు బోల్తా .. 40 మంది విద్యార్థులకు గాయాలు

 హర్యానాలో బస్సు బోల్తా .. 40 మంది విద్యార్థులకు గాయాలు

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూలై 8 న పంచకులలోని పింజోర్ సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు బోల్తా పడింది.  ఈ ఘటనలో  దాదాపు 40 మంది  స్కూల్  విద్యార్థులు గాయపడ్డారు.  పింజోర్‌లోని నౌల్టా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  గాయపడిన విద్యార్థులను చికిత్స  కోసం  పింజోర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 బస్సు అతివేగంగా ఉండడంతో డ్రైవర్ అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో ఓవర్‌లోడ్‌, రోడ్ల అధ్వాన్న స్థితి కూడా ప్రమాదానికి కారణమని  పోలీసులు  భావిస్తున్నారు.