ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలు

ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలు
  • 28 నుంచి రాష్ట్రపతి నిలయంలో ప్రారంభం

సికింద్రాబాద్, వెలుగు: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఈ నెల 28 నుంచి ఈశాన్య రాష్ట్రాల కళామహోత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్టోబరు 6 వరకు కొనసాగే ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని నిలయం కార్యనిర్వహణాధికారి రజనీప్రియ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం తెలియజేసేందుకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు  ఆమె వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం వివిధ రకాల స్టాళ్లు, సాయంత్రం కళాప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. సందర్శించేందుకు https://viit.rashtrapatibhavan.gov.in లో వివరాలు నమోదు చేసుకోవాలని లేదా రాష్ట్రపతి నిలయం ఎంట్రీ గేటు వద్ద ఉన్న కౌంటర్​లో పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.