
హైదరాబాద్, వెలుగు: అరుణోదయ సంఘం ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో శని, ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభలు నిర్వహించనున్నారు. శనివారం సుందరయ్య పార్క్ నుంచి వీఎస్టీ ఫంక్షన్ హాల్ వరకు ప్రజా కళల ప్రదర్శన ఉంటుంది. ఆదివారం ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు. ‘ప్రజా సాంస్కృతికోద్యమం– ఎదరువుతున్న సవాళ్లు’, ‘సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడిని నివారించడం ఎలా?’ అనే అంశాలపై వక్తలు ప్రసంగించనున్నారు.