కేజ్రీవాల్ కు షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధింపు

కేజ్రీవాల్ కు షాక్.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధింపు

ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు కోర్టులో గట్టి షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ కోర్టు శనివారం సీబీఐ అభ్యర్థనను స్వీకరించింది.  ముఖ్యమంత్రి మ  అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి విధిస్తున్నట్టు వెల్లడించింది. మూడు రోజుల పాటు ఆయనను విచారించిన సీబీఐ అధికారులు ఇవాళ జూన్ 29 2024 నాడు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కేసుకు సంబంధించి తీర్పు రిజర్వ్ చేస్తూ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.