ఉద్యోగార్థుల కోసం.. ఆర్య సమాజం బిట్ బ్యాంక్

ఉద్యోగార్థుల కోసం.. ఆర్య సమాజం బిట్ బ్యాంక్
  • 1875లో ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. 
  • నిజాం కాలంలో దళితులు, నిరుపేద హిందువులను ఇస్లాం మతంలోకి అంజుమన్​ తబ్లీ గులిస్లాం సంస్థ చేర్చింది. 
  • మజ్లిస్​ ఇత్తెహాదుల్​ ముస్లిమీన్​ సంస్థను బహదూర్​ యార్​జంగ్​ ఏర్పాటు చేశాడు. 
  • అసఫ్​జాహీ వంశం ముస్లిం పాలనకు చిహ్నమని, దాన్ని సుస్థిరంగా కాపాడటం ప్రతి ముస్లిం ధర్మమని రాజకీయ మతోన్మాదాన్ని ప్రచారం చేసిన సంస్థ మజ్లిస్​ ఇత్తెహాదుల్ ముస్లిమీన్​. 
  • మజ్లిస్​ ఇత్తెహాదుల్​ ముస్లిమీన్​ అనల్​ మాలిక్​(నేనే రాజు) అనే నినాదాన్ని ఇచ్చింది. 
  • స్వామి దయానంద సరస్వతి హైదరాబాద్​లో 1892లో స్వయంగా ఆర్య సమాజం శాఖను ఏర్పాటు చేశారు. 
  • హైదరాబాద్​లో ఆర్య సమాజం మొదటి అధ్యక్షుడు కమతా పర్షాద్​.
  • హైదరాబాద్​లో ఆర్య సమాజం మొదటి వార్షికోత్సవాలు కందస్వామి బాగ్​లో జరిగాయి. 
  • హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మార్చబడ్డ వారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడానికి ఆర్య సమాజం శుద్ధి సభను స్థాపించింది.
  • హిందూ మతంలో మూఢనమ్మకాలు, దురాచారాలను తొలగించడానికి ఆర్యసమాజం సంస్కరణ ఉద్యమం చేపట్టింది.
  • ఆర్య సమాజం ప్రచారాన్ని అడ్డుకోవడానికి సనాతన వాదులు ధర్మ మహామండలిని ఏర్పాటు చేశారు. 
  • ఆర్య సమాజ్​ ముఖ్య గ్రంథమైన సత్యార్థ ప్రకాశికను పండిత కేశవరావు కోరాట్కర్​ తెలుగులోకి అనువదించాడు. 
  • వితంతువుల పునర్​ వివాహాల చట్టం తీసుకురావాలని హైదరాబాద్​ రాష్ట్ర శాసనసభలో 1930లో ఆర్య సమాజం నాయకుడు పండిత కేశరావు కోరాట్కర్​ తీర్మానం ప్రతిపాదించాడు. 
  • నిజాం రాజ్యంలో వితంతువుల పునర్​ వివాహాల చట్టం రూపుదాల్చడానికి పండిత వినాయకరావు విద్యాలంకార్​ కృషి చేశాడు.
  • ఆర్య సమాజం అధ్యక్షులుగా పనిచేసిన పండిత కేశవరావు కోరాట్కర్​ 1932 మే 21న మరణించాడు. 
  • పండిత కేశవరావు కోరాట్కర్​ మరణానంతరం ఆర్య సమాజ్​ హైదరాబాద్​ అధ్యక్షులుగా పండిత వినాయకరావు విద్యాలంకార్​ వ్యవహరించారు. 
  • ఆర్య సమాజ్​ కేంద్ర ప్రచారకులు పండిత రామచంద్ర దహల్వీ, చంద్రభాను హైదరాబాద్​ రాజ్యం పర్యటించకుండా ఏడో నిజాం నిషేధ ఆజ్ఞలు జారీ చేశాడు. 
  • నిజాం ప్రభుత్వం వాక్​ స్వాతంత్ర్యాన్ని అడ్డుకునే గస్తీ నిషన్​ తిర్పన్​ (జీవో నంబర్​ 53)ను 1937లో తీసుకువచ్చారు. 
  • ఆర్య సమాజ్​ కార్యదర్శి నరేంద్రజీని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి మన్ననూర్​ జైలుకు పంపించింది. 
  • 1938లో అఖిల భారత ఆర్యసమాజ్​ మహాసభ షోలాపూర్​లో జరిగింది.
  • ఆర్యసమాజ్​ అఖిల భారత మహాసభ 1938 జనవరి 20న దేశ వ్యాప్తంగా హైదరాబాద్​ విమోచన దినంగా పాటించాలని పిలుపు ఇచ్చింది. 
  • నిజాం ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని నిరసిస్తూ హైదరాబాద్​ సంస్థానంలో సత్యాగ్రహం నిర్వహించే బాధ్యతలను మహాత్మ నారాయణస్వామికి ఆర్యసమాజ్​ అప్పగించింది. 
  • నిజాం ప్రభుత్వం మహాత్మ నారాయణస్వామిని 1939 జనవరి 31న అరెస్టు చేసింది. 
  • నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి షోలాపూర్​లో విడుదల చేసిన అనంతరం ఆర్యసమాజ్​ నాయకుడు నారాయణ స్వామి గుల్బర్గాలో సత్యాగ్రహం చేశారు. 
  • 1944 నాటికి హైదరాబాద్​ సంస్థానంలో 300 ఆర్య సమాజ్​ శాఖలు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాయి. 
  • హైదరాబాద్​ సంస్థానాన్ని ఇండియన్​ యూనియన్​లో విలీనం చేయాలని కోరుతూ 1947 సెప్టెంబర్​ 2న ఆర్య సమాజ్​ కార్యకర్తలు భారత జాతీయ పతాకావిష్కరణ చేశారు. 
  • ఆర్య సమాజ్​ కార్యకర్తలు పరకాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 150 మంది మరణించారు. 
  • 1939లో  హైదరాబాద్​లో కేశవ మెమోరియల్​ స్కూల్​ను స్థాపించారు. 
  • 1934లో ఆర్య సమాజ్​ వేదిక ఆదర్శ్​ పత్రికను ప్రచురించింది.