స్వచ్ఛతా హీ సేవపై అవగాహన

స్వచ్ఛతా హీ సేవపై అవగాహన

పర్వతగిరి/ వర్ధన్నపేట/ కాశీబుగ్గ/ కొత్తగూడ, వెలుగు: ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ–24లో భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులతో మీటింగ్​ఏర్పాటు చేసి పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించారు. పలుచోట్ల ర్యాలీలు, ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. వరంగల్​జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ తహసీల్దార్​వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్​నాయక్​ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా, మండల కేంద్రంలో సెక్రటరీ, జీపీ సిబ్బందితో నిర్వహించారు.

వర్ధన్నపేట మండలం ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో ఎంపీడీవో వెంకటరమణ ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబాబాద్​ జిల్లా కొత్త గూడ పాఠశాలలో హెచ్​ఎం విష్ణువర్ధన్​రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్యక్రమంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. కాజీపేట రైల్వే ప్రాంతంలోని సాయిబాబా ఆలయ సమీపంలో భారత ఆహార సంస్థ మేనేజర్​ధీరజ్​కుమార్​ ఆధ్వర్యంలో ఎఫ్​సీఐ సంస్థ ఉద్యోలుగు పరిసరాలను శుభ్రం చేశారు.