ఆషాఢ అమావాస్యను ( జులై17) భీమ అమావాస్య, జ్యోతిర్భీమేశ్వర అమావాస్య అని కూడా పిలుస్తారు, కర్కాటక అమావాస్య జూలై 17వ తేదీ సోమవారం నాడు జరుపుకొంటారు. ఉత్తర భారతదేశంలో ఈ అమావాస్యను హరియాళీ అమావాస్య అంటారు. ఆషాఢ అమావాస్య జూలై 17.. సోమవారం కాబట్టి, దీనిని సోమవతి అమావాస్య అని కూడా పిలుస్తారు. అమావాస్య తిథి సోమవారం వచ్చినప్పుడు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజు వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేసి ఉపవాసం ఉంటారు. ఆషాఢ అమావాస్య 2023 శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. . .
ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత
హిందూ గ్రంధాల ప్రకారం, ఆషాఢ అమావాస్య రోజున పితృ తర్పణం, పిండదానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని చెబుతారు. ఈ రోజు ప్రజలు పవిత్ర స్థలాలను సందర్శిస్తారు. పుణ్య నదుల్లో పవిత్ర స్నానమాచరించి గంగామాతకు ప్రార్థనలు చేస్తారు. ఈ ఆషాఢ అమావాస్య మరింత ఫలప్రదం కావడంతో ప్రజలు వివిధ ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ రోజు పూర్వీకులను పూజించడం వల్ల జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఆషాఢ అమావాస్య తిథి ఈ ఏడాది (2023) జూలై 16న రాత్రి 10:08 గంటలకు ప్రారంభమై జూలై 18న మధ్యాహ్నం 12:01 గంటలకు ముగుస్తుంది. ఆషాఢ అమావాస్య సోమవారం, జూలై 17 ఉదయ తిథి ఆధారంగా జరుపుకొంటారు. ఈ రోజు శుభ ముహూర్తంలో పితృపూజ చేయడం వల్ల పూర్వీకులకే కాదు మనకు కూడా మంచి ఫలితాలు వస్తాయి.
ఆషాఢ అమావాస్య పూజా విధానం
ఆషాఢ అమావాస్య రోజున, శుభ్రమైన పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరచి, శివపార్వతుల విగ్రహాలను ఉంచాలి. అప్పుడు శివునికి బిల్వపత్రం, సుమంగళిలు ఉపయోగించే అన్ని రకాల వస్తువులను పార్వతీదేవికి సమర్పించాలి. మరుసటి రోజు ఈ సామగ్రిని ఒక పేద మహిళకు దానం చేయండి. ఈ విధంగా చేయడం వలన శివపార్వతిల అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని వేద పండితులు చెబుతున్నారు.
పిత్రు దేవతల ఆగ్రహానికి గురికావద్దు
ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకుల తృప్తి కోసం తర్పణాలు వదలడం, పిండ ప్రదానం చేయడం, శ్రాద్ధ కర్మ నిర్వహించడం తదితర పూజలు చేస్తారు. ఈ రోజు మీరు ఏమి చేయాలని నిర్ణయించుకున్నా, అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. పూర్వీకుల కోపం కారణంగా, మీరు వారి శాపంలో భాగం అవుతారు. ఫలితంగా, పనిలో వైఫల్యం, ఆస్తి నష్టం, ఆర్థిక సంక్షోభం, సంతానం సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
ఆషాఢ అమావాస్య (జులై 17) చేయాల్సినవి..
* భక్తులు గంగా నదిలో లేదా మరేదైనా నదిలో పవిత్ర స్నానం చేయాలి.
* తమ పూర్వీకుల శాంతి కోసం బ్రాహ్మణులకు ఆహారం (స్వయంపాకం), వస్త్రాలతో పాటు దక్షిణ సమర్పించాలి.
* భక్తులు తమ పూర్వీకులకు పితృపూజ, తర్పణాలను అర్హత కలిగిన పూజారులు లేదా బ్రాహ్మణుల ద్వారా పూర్తి చేయాలి.
* ఆషాఢ అమావాస్య రోజున దానధర్మాలు చేయడం, పేదవారికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి వాటికి విరాళం ఇవ్వండి.
* జాతకంలో పితృ దోషం ఉన్నవారు ఆలయాలను సందర్శించి, దేవాలయం దగ్గరలోని ఏదేని ఓ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న దోషాలు తొలిగి..పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ఆషాఢ అమావాస్య నాడు ఏం చేయకూడదు..
* దుస్తులు లేదా బూట్లు కొనకూడదు.
* ఎలాంటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయకూడదు.
* కొత్త వ్యాపారం లేదా కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలం కాదు.
* కొత్త వాహనం కొనడానికి ఇది మంచి రోజు కాదు.
* ఈ రోజు నిశ్చితార్థం, వివాహం వంటి శుభ కార్యాలు చేయవద్దు