
కడెం,వెలుగు: కడెం మండలం కొత్త మద్దిపడగలో నిర్మించిన పునరావాస ఇండ్లను గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు. మైసంపేట్, రాంపూర్ గ్రామాలను తరలించడం కోసం జిల్లా అటవీ శాఖ అధికారి రామకిషన్ తో కలసి జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాంపూర్, మైసంపేట్ గ్రామాల ప్రజల కోసం కొత్త మద్దిపడగ గ్రామం లో నిర్మించిన 94 ఇండ్లను పూర్తి చేశామన్నారు.
స్వచ్ఛంద పునరావాసం కోసం చేసిన పనులను, అటవీ హక్కుల చట్టం ప్రకారం కమిటీ నిర్ధారిస్తుందన్నారు. ఈ గ్రామాల్లో పాఠశాలలను మద్దిపడగకు తరలించాలని గ్రామస్థులు కోరారు. స్పందించిన కలెక్టర్ ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో ఈఈపీఆర్ శంకరయ్య, సీఓ సుధీర్, డీఆర్డీఓ విజయలక్ష్మీ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్వో అనిత పాల్గొన్నారు.