మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ చిత్రాన్ని ఇటీవల ప్రకటించింది. శనివారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. నమ్రత ఘట్టమనేని ఫస్ట్ షాట్కు క్లాప్ కొట్టగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్ స్క్రిప్ట్ని అందజేశారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ మూవీ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
‘మ్యాడ్’ ఫేమ్ శ్రీ గౌరి ప్రియ హీరోయిన్గా, ‘కోట బొమ్మాళి పి.ఎస్’ ఫేమ్ రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా అని, కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుందని దర్శకుడు చెప్పాడు. సెప్టెంబర్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య తెలియజేశారు.