ఇంట్లో యోగా చేస్తూ గుండెపోటుతో ఏఎస్​ఐ మృతి

ఇంట్లో యోగా చేస్తూ గుండెపోటుతో ఏఎస్​ఐ మృతి

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​నగరంలోని వన్​ టౌన్​ఏఎస్ఐ దత్తాత్రి (56) బుధవారం గుండెపోటుతో చనిపోయారు. గాయత్రీనగర్​లో ఉంటున్న ఆయన  ఉదయమే లేచి యోగా చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలారు. కుటుంబీకులు ప్రైవేట్​హాస్పిటల్​కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 1989లో కానిస్టేబుల్​గా పోలీస్​శాఖలో చేరిన దత్తాత్రి అంచెలంచెలుగా ఏఎస్ఐ స్థాయికి ఎదిగారు. ఆయనకు భార్య, ఇంజినీరింగ్​చదువుతున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు.