డ్యూటీలో ఉండగానే గుండెపోటుతో ఏఎస్సై మృతి

డ్యూటీలో ఉండగానే  గుండెపోటుతో ఏఎస్సై మృతి

చండ్రుగొండ, వెలుగు : డ్యూటీలో ఉన్న ఓ ఏఎస్సై గుండెపోటుతో చనిపోయాడు. ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన ఉబ్బన శ్రీనివాసరావు (60) భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు. శుక్రవారం మండలంలో అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటించడంతో శ్రీనివాసరావు బందోబస్తుకు వెళ్లాడు.

 డ్యూటీలో ఉండగానే గుండెపోటు రావడంతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఖమ్మంలోని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శనివారం చనిపోయాడు. శ్రీనివాసరావు మృతదేహానికి జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై జి.స్వప్న పూలమాల వేసి నివాళి అర్పించారు.