
హైదరాబాద్, వెలుగు: టైల్స్ , మార్బుల్స్, క్వార్ట్జ్ , బాత్ వేర్ సొల్యూషన్స్ అమ్మే ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ (ఏజీఎల్ ) హైదరాబాద్లో మెగా డిస్ప్లే షోరూమ్ను ప్రారంభించింది. దీనిని3,500 చదరపు అడుగుల వైశాల్యంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో కంపెనీ అతిపెద్ద డిస్ ప్లే షోరూమ్లలో ఇదీ ఒకటని ఏజీఎల్ తెలిపింది.
ఇక్కడ అలవారో, స్టోన్ ఎరా, టెరాక్, ప్రెస్టో, మార్బుల్ఎక్స్, గ్రెస్టెక్, గ్రాండ్యురా, స్టైల్ఎక్స్, హార్డ్ స్టోన్, ఫ్రెస్కో వంటి సిగ్నీచర్కలెక్షన్అందుబాటులో ఉంటుందని ఏజీఎల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ పటేల్ తెలిపారు.
అద్భుతమైన విజువల్స్, ట్రెండ్ సెట్టింగ్ డిజైన్లు, ఆధునిక షాపింగ్ అనుభవం..ఈ షోరూమ్ప్రత్యేకతలు అని అన్నారు. ప్రీమియం టైల్స్, జీవీటీ కలెక్షన్లు, స్లాబ్ లు, ఇంజనీరింగ్ చేసిన పాలరాళ్లు, క్వార్ట్జ్, శానిటరీవేర్, కుళాయిలను ప్రదర్శిస్తామని అన్నారు.