
అమన్ (జోర్డాన్): ఇండియా రెజ్లర్ మనీషా భన్వాలా.. ఆసియా చాంపియన్షిప్లో గోల్డ్ మెడల్తో మెరిసింది. శుక్రవారం జరిగిన విమెన్స్ 62 కేజీల ఫైనల్లో మనీషా 8–7తో ఒకే జు కిమ్ (కొరియా)పై నెగ్గింది. సెమీస్లో మనీషా 5–1తో కల్మిరా బిలింబెక్ కిజి (కిర్గిస్తాన్)పై గెలిచింది.
అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్లో టైనస్ డుబెక్ (కజకిస్తాన్)పై నెగ్గిన మనీషా క్వార్టర్స్లో 3–0తో హనిబిట్ లీ (కొరియా)ను ఓడించింది. 53 కేజీల బౌట్లో అంటిమ్ పంగల్ 10–0తో మెంగ్ సుయాన్ సీహ్ (చైనీస్తైపీ)పై గెలిచి బ్రాంజ్ మెడల్ను సాధించింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్లో అంటిమ్ 10–6తో జిన్ జెంగ్ (చైనా)ను ఓడించింది. కానీ సెమీస్లో 0–10తో అంటిమ్ కొయెకా (జపాన్) చేతిలో ఓడింది. అయితే కొయెకా ఫైనల్కు వెళ్లడంతో అంటిమ్కు బ్రాంజ్ మెడల్ ఫైట్ ఆడే చాన్స్ వచ్చింది.